Gopi Krishna : అమెరికాలో మరో తెలుగోడు బలి

AP: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. దీనిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అండగా ఉండాలన్నారు.

New Update
Gopi Krishna : అమెరికాలో మరో తెలుగోడు బలి

America : అమెరికాలో మరో తెలుగు వాడు బలి అయ్యాడు. దుండగుడి కాల్పుల్లో బాపట్ల (Bapatla) వాసి మృతి చెందాడు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ (Gopi Krishna) మృతి చెందాడు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకొని అక్కడే స్థానిక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు గోపీకృష్ణ. సూపర్‌ మార్కెట్లోకి వచ్చి గన్‌తో విచక్షణారహితంగా గోపిని కాల్చాడు దుండగుడు. ఈ క్రమంలో గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోయాడు. తానా అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మృతుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పరామర్శించారు.

మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి..

అమెరికాలోని సూపర్‌ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ (Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైయస్ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Also Read : ఆ ఆఫీసుల నిర్మాణాలు ఆపండి.. వైసీపీకి సర్కార్ నోటీసులు

Advertisment
తాజా కథనాలు