/rtv/media/media_files/2025/01/29/4ph3sPUtxSIMiQkqnZX5.webp)
women Murder
కరీంనగర్లో దారుణం చోటు చేసుకుంది. మమత అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయిల్ ప్యాకెట్ తీసుకోస్తానని కారులో బయటకు వెళ్లిన మమత మళ్లీ తిరిగి రాలేదు. కట్ చేస్తే కరీంనగర్ జిల్లా కురికాల ఎస్సారెస్సీ కాల్వ సమీపంలో మమత శవంగా తేలింది. మమతా ఆరేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా కాసింపేటకు చెందిన భరత్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. వారికి ఒక బాబు ఉన్నాడు. కాగ మమతను తీసుకెళ్లింది ఎవరు? ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది? అసలు మమతా హత్యకు కారణమేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Women Murder In Karimnagar
మమతా హంతకులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మమతా కారులో ఎక్కడికి వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తేలాల్సి ఉంది.