Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలు!

తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది.

New Update
ap rains

Telangana: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Also Read: రాక్షసిలా మాట్లాడుతున్నారు‌‌..సురేఖపై అమల ఆగ్రహం

బుధవారం నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల,  వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌,  జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణశాఖ పేర్కొంది. 

Also Read: విచిత్ర వాతావరణం..అక్కడ వానలు..ఇక్కడ మండుతున్న ఎండలు!

సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌,  భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవశాలున్నాయని తెలిపింది.

Also Read: వియత్నాంలో బర్డ్ ఫ్లూ..47 పులులు మృతి

గురువారం నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌,  జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

Also Read: రైతులకు కేంద్రం 'దసరా' కానుక - 'పీఎం కిసాన్‌ నిధులు' విడుదల ఎప్పుడంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు