గుజరాత్ రోడ్డు ప్రమాదం.. ఖమ్మం స్టూడెంట్ మృతి!

గుజరాత్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఖమ్మం జిల్లాకి చెందిన కంచర్ల సంపత్ మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుజరాత్ కు తరలివెళ్లారు.

మార్నింగ్‌ వాకర్స్‌పైకి దూసుకొచ్చిన కారు, తల్లి, కూతురు మృతి
New Update

గుజరాత్‌లో నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. నాయకన్ గూడెంకు చెందిన కంచర్ల సంపత్ రెడ్డి(20) అనే యువకుడు గుజరాత్‌లో బీటెక్ చదువుతున్నాడు. సాయంత్రం పూట తన స్నేహితుడితో బయటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతి చెందినట్లు సమాచారం. తన స్నేహితుడు ఈ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డారు. సంపత్ చనిపోయినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే వీరు గుజరాత్ బయలుదేరి వెళ్లారు. సంపత్ మరణ వార్త వినగానే కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

#accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి