/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/news-rajendranagar-ps-car-accident-mother-daughter-spot-dead.jpg)
గుజరాత్లో నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లాకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. నాయకన్ గూడెంకు చెందిన కంచర్ల సంపత్ రెడ్డి(20) అనే యువకుడు గుజరాత్లో బీటెక్ చదువుతున్నాడు. సాయంత్రం పూట తన స్నేహితుడితో బయటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపత్ మృతి చెందినట్లు సమాచారం. తన స్నేహితుడు ఈ ప్రమాదం నుంచి తీవ్రగాయాలతో బయటపడ్డారు. సంపత్ చనిపోయినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే వీరు గుజరాత్ బయలుదేరి వెళ్లారు. సంపత్ మరణ వార్త వినగానే కుటుంబం విషాదంలో మునిగిపోయింది.