/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాజాగా తొలి ఫలితం వెల్లడైంది. యాదగిరిగుట్టలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విక్టరీ కొట్టారు. కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెలువడిన ఫలితాల్లో ఈ వార్డు ఫలితం మొదటిది కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ విజయంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ బోణీ కొట్టినట్లయింది.
కాగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపు 68-76 మున్సిపాలిటీలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిస్తోంది. సుమారు 29-36 మున్సిపాలిటీల్లో ఈ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 12వ వార్డులో బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది.
Follow Us