చేత‌కాని ద‌ద్ద‌మ్మ అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

TG: సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శల దాడికి దిగారు. మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్నారు.

KTR
New Update

MLA KTR: తెలంగాణలో సీఎం రేవంత్ పాలనపై మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్ (X) వేదికగా సెటైర్లు వేశారు. పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌.. పాగ‌ల్ ప‌నులు అని ఫైర్ అయ్యారు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఎద్దేవా  చేశారు. ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

చేత‌కాని ద‌ద్ద‌మ్మ..

మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ నిప్పులు చెరిగారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే  తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయిందని అన్నారు. మూసీ ప్రాజెక్టులో రూ. 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించిందని చెప్పారు. బిల్డ‌ర్ల‌ను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసిందని అన్నారు.

ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

 ఘనత కేసీఆర్ ది...

మీ బడే భాయ్ మోదీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదని అన్నారు. ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్త‌న భాండాగార‌మైందని అన్నారు. దేశంలోనే ధాన్య‌రాశిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. పేద‌ల కంట క‌న్నీరు లేకుండానే  Paris, Bogota, Mexico City, Montreal ల‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ గ్రీన్ సిటీ అవార్డును హైద‌రాబాద్‌ ద‌క్కించుకుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ

ఎత్తైన కుర్చీలో...

మూసీ న‌దికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హ‌ర్మ్యాలు క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు?  మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ? అని సీఎం రేవంత్ ను నిలదీశారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌దని చురకలు అంటించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కని సీఎంకు హితవు పలికారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌తారని అన్నారు. ప్ర‌పంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe