5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్ష

తెలంగాణలోని సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఈరోజు సంచలన తీర్పు చెప్పింది. కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి 5 ఏళ్ళ బాలికను రేప్ చేసిన నిందితుడికి మరణశిక్షను విధించింది. దాంతో పాటూ బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది.

New Update
court

పోలీసులు, కోర్టులూ శిక్షలు విధిస్తూనే ఉన్నారు. ఎన్‌ఔంటర్లు చేస్తున్నారు, యావజ్జీవాలు వేస్తున్నారు అయినా కూడా దేశంలో మగాళ్ళ బుద్ధి మాత్రం మారడం లేదు. ఆడపిల అంటే చాలు వయసుతో పని లేదు. నెలల పిల్లల దగ్గర నుంచి పండు ముదులి వరకూ ఎవ్వరినీ వదిలపెట్టడంలేదు..రేప్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు దుర్మార్గులు. తాజాగా కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది ఐదేళ్ళ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడికి తెలంగాణలోని సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది.

గతేడాది అక్టోబర్ 16న బీడీఎల్ భానూరులో ఐదేళ్ల చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డాడు గపూర్‌(56) అనే వ్యక్తి. ఇతను బీహార్‌కు చెందిన వాడు. పని కోసం భానూరు వచ్చి సెటిల్ అయ్యాడు. గఫూర్ కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలిక చేత తాగించాడు. ఆ తరువాత అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడని అప్పుడే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏడాది తర్వాత దీని మీద తీర్పును వెలువరించింది . ఈ కేసులో చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ద్వారా 11 నెలల్లో విచారించి కేసుపై తీర్పు వచ్చేలా సంగారెడ్డి ఎస్పీ రూపేష్‌ కుమార్ చేశారు. 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించడం జిల్లాలో ఇదే తొలిసారి.

Advertisment
తాజా కథనాలు