/rtv/media/media_files/2025/06/21/ban-2025-06-21-08-03-37.jpg)
మద్యపాన నిషేధంలో భాగంగా కొన్ని గ్రామాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని మిగితా గ్రామలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్, గుడి తండా, షేర్ శంకర్ తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని గుండారం గ్రామ పరిధిలోని గుండారం, ఎల్లాపూర్ తండా, నడిమితండా గ్రామాలు తాజాగా మద్యపాన నిషేధాన్ని విధించాయి.
లక్ష రూపాయల జరిమానాతో
ఈ మేరకు గ్రామంలోని ఎల్లమ్మ గుడివద్ద సమావేశమై గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటుగా ఏడు చెప్పు దెబ్బలు విధించనున్నట్లు తీర్మానించారు. అంతేకాకుండా ఎవరైనా మద్యం పట్టిస్తే రూ. 20 వేలు బహుమతిగా అందిస్తామని తీర్మానించారు. అలాగే , దొంగతనంగా మద్యం కొని తాగితే ఏడు చెప్పు దెబ్బలు ఉంటాయని తీర్మానంలో పేర్కొన్నారు. మద్యం తాగి యువత చెడిపోతుందని, అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామస్థులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మద్యపాన నిషేధం అమలుతీరును పర్యవేక్షిం చేందుకు గ్రామానికి ఇద్దరి చొప్పున తీసుకొని కమిటీని ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. గ్రామాల సరిహద్దుల్లో ఎవరు మద్యం తాగినా శిక్షలు వర్తిస్తాయని తీర్మానంలో గ్రామస్థులు పేర్కొన్నారు.