/rtv/media/media_files/2025/04/29/tN5tLzAyEzS6lNe8rhpf.jpg)
sritej discharge
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. అతన్ని సికింద్రాబాద్ లోని కేర్ ఆసుపత్రి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు. శ్రీతేజ్ ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తున్నాడని కానీ మనుషుల్ని గుర్తుపట్టడం లేదని, బ్రెయిన్ ఇంకా రికవరీ కాలేదని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపాడు. కానీ స్టేబుల్ గా ఉన్నాడని అన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండటంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రిహాబిలిటేషన్ సెంటర్ లో15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ చేయనున్నారు. అనంతరం శ్రీతేజ్ ను ఇంటికి తీసుకెళ్లొచ్చని వైద్యులు సూచించారు. కాగా శ్రీతేజ్కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యం కొనసాగింది.
#Pushpa2 స్టాంపీడ్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
— Milagro Movies (@MilagroMovies) April 29, 2025
డిసెంబర్ 4 నుంచి చికిత్స పొందుతున్న ఆయనను రీహాబ్ సెంటర్కు షిఫ్ట్ చేశారు. కళ్లు తెరిచారు, లిక్విడ్స్ తాగుతున్నారు. పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది.#AlluArjun pic.twitter.com/nqD5VSUhJI
2024 డిసెంబర్ 04వ తేదీన పుష్ప2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ను వెంటనే కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప2 మేకర్స్ అండగా నిలిచారు. హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో రూ. 50 లక్షల పరిహారం అందజేశారు. అంతేకాకుండా శ్రీతేజ్ ట్రీట్ మెంట్ కోసం అల్లు అర్జున్ స్వయంగా ఖర్చులు భరించారు.
అల్లు అర్జున్ పై కేసు
రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటిరోజు విడుదలయ్యారు.