AP DRUGS: ఏపీ కానిస్టేబుల్ డ్రగ్స్‌ దందా! హైదరాబాద్ లో అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా గుట్టు రట్టయింది. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కోట్ల విలువైన సరుకు హైదరాబాద్ తీసుకొస్తుండుగా ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుపతికి చెందిన  కానిస్టేబుల్ గుణశేఖర్ కూడా ఉన్నారు.

New Update

Drug Mafia: తెలంగాణాలో వరుసగా డ్రగ్స్ ముఠాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ లో మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి రూ. 2 కోట్ల విలువ చేసే సరుకును హైదరాబాద్ తరలిస్తుండగా డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈ వ్యవహారంలో ఓ యువతితో పాటు ఏపీ తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ , మరో ఆరుగురుని అరెస్ట్ చేశారు. 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదును సైబరాబాద్ SOT పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే షాద్నగర్ తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 3 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు