Hyderabad: రాక్షసిలా మాట్లాడుతున్నారు‌‌..సురేఖపై అమల ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ మీద నాగార్జున భార్య, అక్కినేని అమల మండిపడ్డారు. మహిళా మంత్రి అయి ఉండి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసెన్సీ లేకుండా రాక్షసిలా మాట్లాడుతున్నారు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. 

author-image
By Manogna alamuru
2
New Update

Akkineni Amala Tweet: 

మంత్రి కొండా సురేఖ నాగచైతన్య–సమంతల మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను విమర్శించడానికి ఆమె అన్న మాటలు ఇప్పడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఈ కామెంట్స్‌పై అందరూ తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే మంత్రి సురేఖ మీద రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడ మాటలను అదుపులో పెట్టుకోవాలంటూ సురేఖకు చివాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబం మొత్తానికి విపరీతమైన కోపం తెప్పించాయి. ఇప్పటికే దీని మీద నాగార్జున, సమంత, చై అందరూ స్పందించారు. రాజకీయాల్లోకి తమను ఎందుకు లాగుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా నాగార్జున వైఫ్ అమల కూడా కొండా సురేఖ కామెంట్స్ మీద ట్వీట్ చేశారు. 

మంత్రి కొండా సురేఖ దెయ్యం పట్టినట్టు మాట్లాడుతున్నారని అమల మండిపడ్డారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి ఇలా ఎలా ప్రవర్తిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల పౌరులు ఎవరూ ఇటువంటి చర్యలకు పూనుకోరని అమల అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడ్డం..షేమ్ ఫుల్ అని అన్నారు. మంత్రులే ఇలా క్రిమినల్స్‌లా, అసహ్యంగా మాట్లాడుతుంటే...వాళ్ళు దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. దీనిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ట్యాగ్ చేశారు. మీ పార్టీ మంత్రి ఇంత బాధ్యత లేకుండా, అసహ్యంగా మాట్లాడినందుకు ఆమె చేత సారీ చెప్పించాలని అమల డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్ళ బారి నుంచి దేశాన్ని కాపాడాలని ఆమె రాహుల్ ను కోరారు.  

 

tweet

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe