Tirupati Flight:
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ తిరిగి విమానాన్ని శంషాబాద్కు తీసుకెళ్లాడు. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమాన సిబ్బంది పేర్కొంది. విమానం క్షేమంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల లడ్డూ పై జరుగుతున్న వివాదం సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కల్గిస్తోంది.