/rtv/media/media_files/2025/02/18/dhZQx8kvi3pBqnlLxWdz.webp)
Indiramma House
Indiramma Houses : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను తొలిసారి జియో ఫెన్సింగ్ చేయనున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక యాప్ను రూపొందించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది. లబ్ధిదారుల ఎంపిక మొదలు చివరి దశలో పూర్తయ్యే నిర్మాణాన్ని పరిశీలించి నిధులను విడుదల చేసేంత వరకు ఈ టెక్నాలజీని వాడుకోనున్నది.
ఇది కూడా చదవండి: Vizag Lorry Incident: విశాఖలో లారీ భీభత్సం.. పార్కులోకి దూసుకెళ్లడంతో..
అవకతవకలు, లోపాల్లేకుండా ఏఐ టెక్నాలజీ
ఇంటినిర్మాణం కోసం చూపించిన స్థలం, ఇచ్చిన వివరాల ఆధారంగా ఏఐ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు మొబైల్ యాప్లో అప్లోడ్ చేస్తారు. నిర్మాణ దశలను బట్టి గృహనిర్మాణ కార్పొరేషన్ నిధులను విడుదల చేయనుంది. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు, ప్రభుత్వ అధికారులు ఇచ్చే ఇన్పుట్స్, మొబైల్ యాప్లో ఇండ్ల నిర్మాణ పురోగతి తదితరాలను లోడ్ చేస్తారు. తద్వారా ఎలాంటి అవకతవకలు, లోపాల్లేకుండా వ్యవహరించేందుకు కొత్త సాఫ్ట్ వేర్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడిస్తున్నారు.
Also Read: మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో
దీనిప్రకారం ఇంటి నిర్మాణానికి కేటాయించిన స్థలం వివరాలను యాప్లో నమోదు చేస్తారు. ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేసే సాఫ్ట్వేర్కు అనుసంధానమై ఉన్నందున ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. దరఖాస్తులో పేర్కొన్న విధంగా ఇంటి స్థలం ఉందా? అదే స్థలంలో నిర్మాణం జరుగుతుందా లేదా? పునాది నుంచి పైకప్పు వరకు ప్రభుత్వం ఎంపిక చేసిన మోడల్ ప్రకారమే ఉన్నదా? అలాగే నిర్మాణం జరుగుతున్న ఇల్లు ఎంపికైన లబ్ధిదారులకు చెందిందేనా? వంటి అంశాలను సర్వేయర్లు, ఇతర సిబ్బంది యాప్లో అప్లోడ్ చేస్తుంటారు. మరోవైపు జియో ఫెన్సింగ్ కో ఆర్డినేట్ అవుతుందా లేదా అనేది ఏఐ టెక్నాలజీ పరిశీలిస్తుంది.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
ఇండ్ల నిర్మాణంతో సంబంధం ఉన్న వివిధ విభాగాల అధికారులు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎప్పటికప్పుడు పనుల పురోగతిని తెలుసుకోడానికి ఏఐ టెక్నాలజీ ఉపకరిస్తుంది. ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది మొదలు లబ్ధిదారులకు వీలయినంత వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చేయడం అన్ని కూడా ఈ టెక్నాలజీని అనుసరించే జరుగుతాయి. దరఖాస్తులు వచ్చిన వెంటనే ఆ స్థలాన్ని లేదా పాత ఇంటిని గుర్తించడం, పునాది మొదలు శ్లాబ్ లేదా రేకుల పైకప్పు వరకు, ఇంటి గోడలు, ఇంటి విస్తీర్ణం, ఖాళీ స్థలం, అప్రూవ్ చేసిన డిజైన్, ఇలా అన్నింటినీ ఈ సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: Vizag Lorry Incident: విశాఖలో లారీ భీభత్సం.. పార్కులోకి దూసుకెళ్లడంతో..
కాగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని మూడు కేటగిరీలుగా విభజించింది. సొంత స్థలం ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరి, సొంత స్థలం లేనివారిని ఎల్-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3 కేటగిరీలో చేర్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. మొదటి దశలో సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించిన రోజే ప్రకటించింది. ఈమేరకు ఇటీవల సర్వే చేసిన అధికారులు సొంత స్థలం ఉన్న నిరుపేదలతో కూడిన ఎల్1 జాబితాను సిద్ధం చేశారు. ఇళ్లు కట్టే స్థలాన్ని సర్వే సమయంలోనే చూపించారు. ఇప్పుడా స్థలం జియో ఫెన్సింగ్ చేయనున్నారు.
Also Read: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు