శంషాబాద్ నుంచి అయోధ్య రామ జన్మభూమికి విమాన సర్వీసులు

శంషాబాద్ నుంచి అయోధ్య రామ మందిరానికి వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌కి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా.. ప్రయాగరాజ్, ఆగ్రాకు రేపటి నుంచి ప్రారంభించనున్నారు.

author-image
By Kusuma
New Update
airport

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త. రామ జన్మభూమి అయిన అయోధ్యకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రజలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని విమాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు వారానికి 4 రోజుల పాటు నడిచే సర్వీసును నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల పాటు నడిచే సర్వీసును సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని అధికారులు తెలిపారు. ఒక్క నెలలోనే హైదరాబాద్ నగరం నుంచి కొత్త 7 సర్వీసులు ప్రారంభించడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు