/rtv/media/media_files/2025/10/04/dasara-2025-10-04-07-02-42.jpg)
తెలంగాణలో దసరా పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆ రోజున మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది. ఈ ఏడాది దసరాకు కూడా అంతే.. మాములుగా జరగలేదు. దసరాకు నాలుగు రోజుల ముందుగానే రూ. 800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అంటున్నారు. దసరా రోజునే గాంధీ జయంతి కావడంతో మద్యం ప్రియులు ముందుగానే వైన్ షాపులకు భారీగానే క్యూ కట్టారు.
2025 సెప్టెంబర్ 28వ తేదీన రూ. 200 కోట్లు, 29వ తేదీన రూ. 278 కోట్లు, సెప్టెంబర్ 30 వ తేదీన సుమారు రూ. 333 కోట్లు , అక్టోబర్ 1వ తేదీన సుమారు రూ. 86.23 కోట్లు సెల్స్ జరిగాయని అధికారులు అంటున్నారు. దసరా జోరుకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రావడంతో సెప్టెంబర్ లో ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం రూ. 3,046 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఐఎంఎల్ (లిక్కర్) సుమారు 29.92 లక్షలు, బీర్ల కేసులు సుమారు 36.46 లక్షలు ఉన్నాయని అంటున్నారు. రెస్టారెంట్లలో సగటున ప్రతి 10 నిమిషాలకు ఒక ఫుల్ బాటిల్, లేదా ఒక బీర్ బాటిల్ చొప్పున అమ్ముడుపోతుందని అంచనా.
తెలంగాణలో దసరా పండుగకు రికార్డు బ్రేకింగ్ మద్యం అమ్మకాలు
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
దసరా పండుగ ముందు మూడు రోజుల్లో రూ.700 కోట్ల మద్యం అమ్మకాలు
గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ ఉంటాయని ముందు జాగ్రత్త పడ్డ మందు బాబులు
సెప్టెంబర్ 30న అత్యధికంగా రూ.333 కోట్ల విక్రయాలు
గతేడాది దసరా పండుగ 8 రోజుల్లో… pic.twitter.com/bIShJbdaSV
రంగారెడ్డి జిల్లా టాప్
గత ఏడాది సెప్టెంబర్ 2024తో పోలిస్తే, ఈ సెప్టెంబర్లో మద్యం అమ్మకాలు 7% పైగా పెరిగాయి. జిల్లాల వారీగా చూస్తే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ శివారు ప్రాంతాలు) అత్యధిక మద్యం విక్రయాలతో ముందు స్థానంలో ఉంది. గత ఏడాది దసరా సందర్భంగా మొత్తం 10 రోజుల్లో రూ.1,100 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్శాఖ అప్పట్లో వెల్లడించింది. మద్యం విక్రయాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి. పండుగల సీజన్లో అమ్మకాలు భారీగా పెరగడం వలన ఎక్సైజ్ శాఖ అంచనాల కంటే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టగలిగింది.
4 రోజులు.. 800 కోట్లు.!
— Telugu Reporter (@TeluguReporter_) October 4, 2025
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఊర్లలో జోరుగా సాగిన దావత్ లు..
4 రోజుల్లో లిక్కర్ సేల్... రూ. 800 కోట్లు. బెల్ట్ షాపుల్లో ఏరులై పారిన మద్యం
2న గాంధీ జయంతి వచ్చినా.. ముందే కొనుగోలు చేయడంతో పెరిగిన అమ్మకాలు..#Telangana#Dussehra2025#LiquorSalespic.twitter.com/Vj3n9TfPkn
మటన్ షాపులు ఓపెన్ గానే
ఇక గాంధీ జయంతి సందర్భంగా గురువారం రోజున మటన్, చికెన్ షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ నిబంధన ఎక్కడా అమలు కాలేదు. చాలా చోట్ల మటన్ షాపులు ఓపెన్ గానే కనిపించాయి.