సీఎం రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల కుంభకోణం.. ఆధారాలు బయటపెడతా: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తోందన్నారు. త్వరలోనే రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి అమృత్ టెండర్ల కుంభకోణం బయటపెడతానని చెప్పారు.

rvn df
New Update

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తోందని, అమృత్ టెండర్ల కుంభకోణం మొత్తం సాక్ష్యాలతో సహా బయటపెడుతమన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రూ. 8, 888 కోట్ల రూపాయల భారీ అవినీతికి రేవంత్ రెడ్డి తెరలేపారన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని, తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయి అవకాశం ఉందని, ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని చెప్పారు. 

బావమరిది కోసం టెండర్లు కట్టబెట్టి..

ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి, బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు. రూ. 1137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందట. ముఖ్యమంత్రి బావమరిది మాత్రం 80% వెయ్యి కోట్ల పని చేస్తాడట. ఐహెచ్ పి అనే కంపెనీ సెబికి సమాచారం ఇచ్చింది. ఈ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకొని అనుముల రేవంత్ రెడ్డి, సూదిని సృజన రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులపైన ఒత్తిడి తీసుకువచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ భారీ అవినీతికి తేర లేపారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7,11,13  నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు.  

ఈ చట్టం ప్రకారం పదవి కోల్పోతారు..

ఇక రేవంత్ పదవి కోల్పోతారని, తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిస్తే, ఆశ్రితపక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులని అన్నారు. ఇవే చట్టాల కింద సోనియాగాంధీ తన పదవిని కోల్పోయిందని, 2006లో సోనియా గాంధీ నేషనల్ అడ్వైజరి కౌన్సిల్ చైర్పర్సన్ గా పదవిలో ఉన్నందుకు ఈ చట్టం ప్రకారం మన పదవిని కోల్పోయిందని గుర్తు చేశారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప కూడా అక్రమ మైనింగ్ అనుమతులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి 2011లో అశోక్ చవన్ ఆదర్శ కుంభకోణంలో తన పదవి కోల్పోయారు. బావమరిది కళ్ళల్లో సంతోషం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. తన ఇంట్లో లంకే బిందలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు ముఖ్యమంత్రి తెరలేపారని ఆరోపించారు.  

పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి..

రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో పిలిచిన రూ.8,888 కోట్లు టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టడం లేదన్నారు. ఇండియన్ హ్యూమన్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్సేంజ్ లకు సమాచారం ఇవ్వాల్సినా గత్యంతరం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి దక్కిన వందల కోట్ల రూపాయల టెండర్ బయటకు వచ్చిందన్నారు. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వం వెబ్ సైట్లో పెట్టడం లేదని, టెండర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు వరుసగా ఉంచుతామన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి కుంభకోణాలను ప్రజల ముందు ఉచితం. బావమరిదికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని పంచుతున్న రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఎండగడతామని కేటీఆర్ మండిపడ్డారు.  

సృజన్ రెడ్డి కంపెనీకి ఉన్న లాభం కేవలం రెండు కోట్లే. రెండు కోట్ల కంపెనీ వెయ్యికోట్ల పనులు చేస్తుందట. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్ పి కంపెనీ కేవలం రూ.200 కోట్లు పనిచేస్తుందట. బావమరిది కంపెనీకి రూ. 1100 కోట్ల పనులు ఇచ్చి జీవోలు ఎందుకు వెబ్ సైట్లో పెట్టడం లేదో రేవంత్ రెడ్డి చెప్పాలి. రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్లు టెండర్ అప్పజెప్పి ఈ విషయాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి దాస్తున్నారో చెప్పాలి. ఇందులో ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే ఈ టెండర్ల గోల్మాల్ జరిగింది. ఈ రాష్ట్రంలో బయటకు సమాచారం రాని అక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. 

అమృత్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. అందుకే ఈ టెండర్లు జరిగిన అభివృద్ధి అక్రమాలపైన నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు లేఖ రాశాం. ఈ టెండర్లలో జరిగిన అక్రమాలను తేల్చాలని కోరాం. భారతీయ జనతా పార్టీకి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్న కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం జరిగిన అక్రమాల పైన ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీ కుమక్కు కాకుంటే పూర్తిస్థాయి ఎంక్వైరీ విచారణకు కేంద్రం ఆదేశించాలి. అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలి. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకుంటే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పరిధిలోని ఈ పథకంలో జరుగుతున్న అవినీతిపైన వెంటనే విచారణకు ఆదేశించాలి. లేకుంటే రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ నేతలకు అవినీతితో సంబంధం ఉందని భావించాల్సివస్తుందన్నారు. 

ఈ విషయంలో స్పందించకుంటే మీ కుమ్మక్కు రాజకీయాలు అర్థమవుతాయి. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ మౌనం వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తనకు నచ్చిన విచారణ సంస్థతో ఈ అంశంలో విచారణ చేయించాలి. రాష్ట్రంలో బీజేపీ- కాంగ్రెస్ మధ్యలో ప్రేమ కథ నడుస్తుంది. అందుకే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, రాజాసింగ్.. ముఖ్యమంత్రి శుద్ధపూస అంటూ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

#cm-revant #brs-mla-ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe