/rtv/media/media_files/2026/02/13/jogulamba-2026-02-13-11-11-36.jpg)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ఫలితాల్లో BRS తన హవాను చాటుకుంది. ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 13 వార్డుల్లో విజయం సాధించింది.7 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో అయిజ పట్టణంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు జిల్లాలోని గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల పూర్తి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది.
Follow Us