/rtv/media/media_files/2025/06/10/JmSvfp90BFVYtJzCCbHb.jpg)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ
జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడించేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో కవితను అదుపులోకి తీసుకుని చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. జాగృతి కార్యకర్తలను కూడా వాహనాల్లో తరలించారు పోలీసులు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని మండిపడ్డారు కవిత.