నైరుతి రుతపవనాల రాక ఈ ఏడాది కొంత ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. అయితే ఇప్పుడు రుతపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనుండగా.. ఆ తర్వాత తెలంగాణను కూడా తాకనున్నాయని తెలిపారు. అయితే ఈనెల ఆదివారం లోపు తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అధికారులు తెలిపారు. అనంతంరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా రానున్న రుతుపవనాలు.. కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ
Translate this News: