Telangana CP Mahanti: ‘ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు’.. అనే డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఇదే డైలాగ్తో మందు బాబులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మత్తులో ఒక్కడు చిక్కినా తాట తీసుడే అని హెచ్చరిస్తున్నారు. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. దొరికారో కోడిని కమ్మినట్లు కమ్మేసుడే అంటున్నారు తెలంగాణ కాప్స్. తెలంగాణలో కొత్త ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ప్రభుత్వం. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తండా డేగ కన్నుతో వేట సాగిస్తున్నారు. డ్రగ్స్ అనే పదం వినిపిస్తే చాలు.. వేటాడి వెంటాడి పట్టేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్..
న్యూఇయర్ సెలబ్రేషన్స్పై నజర్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ సీపీ అవినాష్. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Translate this News: