Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వీరితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయిస్తున్నారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరించగా.. కేసీఆర్, కేటీఆర్ సభకు హాజరు కాలేదు.

New Update
Telangana: తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం..

Telangana Assembly: తెలంగాణ మూడవ అసెంబ్లీ తొలి సమావేశం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఈ సభకు 119 ఎమ్మెల్యేల్లో 109 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరయ్యారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సభకు దూరమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సభకు హాజరు కాలేదు. కేటీఆర్ సైతం సభకు హాజరు కాలేదు. ఇక అసెంబ్లీలో కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు అడుగు పెట్టారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సభ్యులందరితోనూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read:

కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..!

కొత్త ప్రభుత్వంలో కోదండరామ్‌కు కీలక పదవి..!

Advertisment
తాజా కథనాలు