Owaisi: ఒవైసీ బ్రదర్స్కు రిలీఫ్.. హైకోర్టు కీలక తీర్పు! TG: తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఒవైసీ బ్రదర్స్కు ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల కూల్చివేతపై తొందరపడొద్దని హైడ్రాకు సూచించింది. ప్రస్తుతం కాలేజీల కూల్చివేతలను ఆపేయాలని హైడ్రాకు తెలిపింది. కాగా ఇటీవల ఒవైసీ కాలేజీలకు హైడ్రా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Owaisi: ఒవైసీ బ్రదర్స్కు రిలీఫ్ లభించింది. విద్యాసంస్థల కూల్చివేతల విషయంలో తొందరపడొద్దని, నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలని హైకోర్టు హైడ్రాకు తెలిపింది. అలాగే పల్లా, మర్రి కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. తమ విద్యాసంస్థల కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. కాలేజీలను కూల్చివేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని.. విద్యా సంవత్సరం దెబ్బతింటుందని కోర్టును కోరారు పల్లా. దీంతో కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని పేర్కొంది. ఫాతిమా కాలేజీకి కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫాతిమా కాలేజీ బఫర్ జోన్లో ఉందంటూ హైడ్రా నోటీసులు ఇచ్చిన సంగఠీ తెలిసిందే. మరోవైపు కాలేజీల కూల్చివేతపై ఆచితూచి వ్యవహరిస్తామని సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ చెప్పారు. దీంతో ఒవైసీ బ్రదర్స్కు ఊరట లభించే అవకాశం ఉంది. #owaisi-brothers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి