కూల్చివేతలపై హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతను ఆపాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. జన్వాడ ఫామ్హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలిచ్చింది. అనుమతులు ఉన్నాయా? FTL పరిధిలో ఉందా? అన్న విషయం పరిశీలించాకే ముందుకెళ్లాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ ఎవరిది?
జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఫాంహౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
Translate this News: