TGPSC GROUP-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ కు ఎంపికపై కమిషన్ కీలక నిర్ణయం!

గ్రూప్‌ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్‌ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తేల్చి చెప్పింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్‌ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది.

New Update
TGPSC Group-1 Results : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే!

TGPSC Group 1: గ్రూప్‌ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ అలర్ట్‌ జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు తేల్చి చెప్పింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్‌ 29, 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఒకటి నిష్పత్తి 100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం…వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకొని…అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని కమిషన్‌ ని ఆదేశించింది.ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన సర్వీస్ కమిషన్‌ వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. 1:100 పద్థతి సాధ్యం కాదని తేల్చి పడేసింది.

గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనలో 1: 50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వివరించింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీ చేసింది. గ్రూప్‌-1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన జీవో లలోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.

Also read: బ్రిటీష్ ఎన్నికల్లో భారతీయుల ఆధిపత్యం..!

Advertisment
తాజా కథనాలు