Gaddar Death Anniversary: గద్దరన్నకు CM రేవంత్ రెడ్డి సహా ప్రముఖల ఘన నివాళి!

ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.

New Update
Gaddar Death Anniversary:  గద్దరన్నకు CM రేవంత్ రెడ్డి సహా ప్రముఖల ఘన నివాళి!

Gaddar Death Anniversary: తెలంగాణ ఉద్యమ పోరాటంలో తన పాటలతో యావత్ ప్రజలను ఉత్తేజపరిచిన గొప్ప విప్లవకవి గద్దరన్న. పొడుస్తున్న పొద్దు మీద.. అమ్మ అమ్మా తెలంగాణమ్మా’ విప్లవాత్మక పాటలు ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిల్చాయి. పేదల రాజ్యమే అంతిమ లక్ష్యంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. పీడిత ప్రజల గొంతుకగా నిలిచి పాటకు పోరాటం నేర్పిన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. నేటితో ఈ విప్లవ గీతం మూగబోయి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా గద్దర్ యాదిలో ఆయనను స్మరిస్తూ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సజ్జనార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పలువురు ఘన నివాళులు తెలియజేశారు.

publive-image

Also Read: Gaddar Death Anniversary : గద్దరన్న యాదిలో.. పాటలతో అభిమానుల ఘన నివాళి! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు