BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా?

ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీస్ అధికారులు. మొత్తం రూ.6.5 కోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ డబ్బులు కాంగ్రెస్ నేత, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.

BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా?
New Update

Telangana Elections 2023: ఎన్నికల వేళ తెలంగాణలో నోట్ల కట్టలు పారుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట పోలీసులు భారీగా నగదును పట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద భారీగా నగదు పట్టబడింది. మొత్తం 6.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ డబ్బు కాంగ్రెస్ కీలక నేత, పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం 6 కార్లలో డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. అయితే.. పొంగులేటి ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఈ వార్త అప్డేట్ అవుతోంది..) 

#breaking-news #telangana-election-2023 #telugu-news-updates #ponguleti-srinivas-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe