/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RS-Praveen-Kumar-1-jpg.webp)
కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు బీఎస్పీ నిర్వహించిన భహిరంగ సభకు మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ కోటా ఉండాలని.. మొదటి నుంచి బీఎస్పీ ఈ విషయం చెప్తోందన్నారు. ఇక, తెలంగాణలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని.. భ్రష్టాచార్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయేది బిఎస్పీ సర్కారేనన్నారు. సబ్బండవర్గాలకు అండగా ఉండేది బీఎస్పీ పార్టీనే అని.. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఎస్పీ గెలిస్తే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని మాయావతి చెప్పారు.
Why did RSP enter politics? @NtvTeluguLive pic.twitter.com/BJYINR0mxO
— BSP Telangana & Andhra Pradesh (@bsp_ts) November 22, 2023