మరో 7 గురు బీజేపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఇదే!

బీజేపీ మరో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయా అభ్యర్థులకు ఫోన్ చేసి సమాచారం అందిస్తోంది పార్టీ నాయకత్వం. ఫోన్ వెళ్లిన వారిలో.. మల్కాజిగిరి: రామచంద్ర రావు, కంటోన్మెంట్: మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్ ఉన్నారు.

మరో 7 గురు బీజేపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఇదే!
New Update

రేపు నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మిగిలిన 11 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఒక్కొక్కటిగా బీజీపీ (BJP) ప్రకటిస్తోంది. ఈ మేరకు ఆయా అభ్యర్థులకు రాష్ట్ర నాయకత్వం ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పార్టీ నాయకత్వం నుంచి ఫోన్ వెళ్లిన వారి లిస్ట్ (BJP Final List) ఇలా ఉంది..

ఇది కూడా చదవండి: Telangana Elections: రేవంత్‌కు వైఎస్ షర్మిల హెల్ప్.. ఏం చేసిందంటే..

- మల్కాజిగిరి: రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్సీ

- కంటోన్మెంట్: కృష్ణ ప్రసాద్, మాజీ ఐపీఎస్ అధికారి

- శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్

- పెద్దపల్లి: దుగ్యాల ప్రదీప్ కుమార్

- సంగారెడ్డి: పులి మామిడి రాజు

- నాంపల్లి: రాహుల్ చంద్ర

- మేడ్చల్: విక్రమ్ రెడ్డి

ఇదిలా ఉంటే.. ఇప్పటికే టికెట్ ఖరారైన అనేక మంది అభ్యర్థులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు బీఫామ్ లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుందన్నారు. మిగిలిన సీట్లకు సంబంధించి ఈ రోజు రాత్రి ఢిల్లీ నుంచి జాబితా రానుందని చెప్పారు. ఇప్పటికే చాలామంది నేతలు నామినేషన్ వేశారన్నారు. యువత సపోర్ట్ తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు వాళ్ల పనులు వాళ్ళు చేస్తున్నారన్నారు. దానికి తమకు సంబంధం లేదన్నారు. ఐటీ అధికారులు దాడి చేస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. బీజేపీ ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి నినాదానికి ఆయా సామాజిక వర్గాల వారి నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

#telangana-elections-2023 #g-kishan-reddy #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe