ఎలాగైనా పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila) మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) మంత్రాంగమే ఇందుకు కారణమని సమాచారం. వైఎస్సార్ ఫ్యామిలీతో పొంగులేటికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన 2014లో ఖమ్మం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరినా.. వైఎస్ ఫ్యామిలీకి మాత్రం ఆయన దూరం కాలేదు. ఈ నేపథ్యంలోనే తాను పాలేరు నుంచి పోటీకి దిగుతున్న నేపథ్యంలో కొత్తగూడం నుంచి పోటీ చేయాలని షర్మిలను పొంగులేటి కోరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!
YS Sharmila: షర్మిల బిగ్ ట్విస్ట్.. పొంగులేటి సూచనతో అక్కడి నుంచి పోటీకి సై?
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనతో కొత్తగూడెం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అక్కడ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ కాకుండా సీపీఐ పోటీ చేస్తుండడంతో.. హస్తం పార్టీ ఓటు బ్యాంకు అంతా తన వైపు కన్వర్ట్ అవుతుందని షర్మిల స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.
Translate this News: