KCR: రయ్..రయ్.. ఒక్క రోజే కేసీఆర్‌ రెండు చోట్ల నామినేషన్లు!

New Update
KCR: రయ్..రయ్.. ఒక్క రోజే కేసీఆర్‌ రెండు చోట్ల నామినేషన్లు!

TELANGANA ELECTIONS 2023: కేసీఆర్‌(KCR) ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా చేస్తారు. మునపెన్నడూ లేని విధంగా ఈ సారి రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుస బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అందులోనూ ఈసారి టఫ్‌ ఫైట్ ఉంటుందని సర్వేలు చెబుతుండడంతో కేసీఆర్‌ ఎక్కడ ఛాన్స్ తీసుకోవడం లేదు. ఇక నవంబర్‌ 3న మొదలైన నామినేషన్ల ప్రక్రియ రేపటి(నవంబర్ 10)న ముగియనున్నాయి. దీంతో ఇవాళే(నవంబర్ 9) కేసీఆర్‌ తాను పోటి చేయనున్న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు.

హెలికాఫ్టర్‌లో అటూ..ఇటు:
నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈసారి ఆయన గజ్వేల్, కామారెడ్డి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయం 10:45కు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి గజ్వేల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 10:55కు గజ్వేల్ టౌన్‌లో ల్యాండ్‌ అవుతారు. ఆ తర్వాత 11 -12 గంటల మధ్య గజ్వేల్‌లో నామినేషన్‌ వేస్తారు. తర్వాత తిరిగి ఫాంహౌజ్‌ చేరుకుని లంచ్‌ చేస్తారు. మధ్యాహ్నం 1:40కి కామారెడ్డికి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి రిటర్నింగ్‌ అధికారి ఎదుట నామినేషన్‌ సమర్పించనున్నారు.

నామినేషన్‌ ఆ వెంటనే ప్రసంగం:
రెండు చోట్ల నామినేషన్ వేసిన తర్వాత కేసీఆర్‌ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల తర్వాత కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత శనివారం కేసీఆర్ తన ఇష్టదైవం కొన్యాపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. ఆలయ అర్చకులకు ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అర్చకులు ఈ పత్రాలను మూలవిరాట్టులో ఉంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గోత్రం, నామం, తీర్మానంతో పూజలు నిర్వహించారు. ఇప్పుడు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ఈ నామినేషన్లను సమర్పించనున్నారు.

Also Read: నేనూ సీఎం అభ్యర్థినే.. మనసులోని మాట చెప్పేసిన మధుయాష్కి..

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: చైనా వద్దు..స్వదేశీ వస్తువులనే వాడదాం..ప్రధాని మోదీ

విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ లోని తయారయ్యే వస్తువులనే వాడాలని చెప్పారు. హోలీ, దీపావళి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో దిగుమతి వస్తువులపై ఆధారపడటాన్ని ప్రతిఒక్కరూ తగ్గించుకోవాలన్నారు.

New Update
PM Modi

PM Modi

ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన స్వదేశీ వస్తువుల వాడకంపై మాట్లాడారు. భారత్ మార్కెట్లను ముంచేస్తున్న విదేశీ వస్తువులపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై. మన దేశంలో అన్నీ తయారవుతున్నాయి అని...ప్రజలు వాటినే వాడేందుకే ప్రాముఖ్యతను ఇవ్వాలని మోదీ కోరారు. వినాయకుడి విగ్రహాలను సైతం విదేశాల నుంచే తెచ్చుకుంటున్నామన్న ఆయన..  లాభాల మాట అటుంచి విదేశీ వస్తువుల్ని విక్రయించమని గ్రామస్థాయి నుంచి వ్యాపారులు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

మన పండుగలలో విదేశీ వస్తువులు..

వినాయకచవితి, హోలీ, దీపావళి ఇలా మన పండలన్నింటిలో విదేశీ వస్తువులు వచ్చి కూర్చొంటున్నారు. మన వినాయకుడిని వేరే దేశం వాళ్ళు తయారు చేయడమేమటి? కళ్ళు, ముక్కు సరిగ్గా లేకపోయినా వాటిని మనం కొనుక్కోవడం సరికాదని ప్రధాని అన్నారు. కొన్నేళ్లుగా పండుగ విక్రయాల్లో విదేశీ వస్తువులదే ఆధిపత్యం ఉంటోంది. ఇది స్థానిక కళాకారులు, తయారీదారులపై ప్రభావం చూపిస్తోంది అని అన్నారు. మన దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే మన వస్తువులనే వాడాలని మోదీ చెప్పారు. మన ఇళ్ళల్లో తిష్ట వేసుకుని కూర్చొన్న విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

 today-latest-news-in-telugu | pm modi | make-in-india

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

Advertisment
Advertisment