ఇవాళ జలవిహార్లో న్యాయవాదులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని… 2014కు ముందు.. తర్వాత తెలంగాణ పరిస్థితులను ప్రజలు గమనించాలని అన్నారు. అక్టోబర్ 25న పాక్స్కాన్ కంపెనీకి కాంగ్రెస్(Congress) నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) లేఖ రాశారని అన్నారు. హైదరాబాద్లో పెడుతున్న పాక్స్కాన్ ఫ్యాక్టరీని బెంగళూరుకు తరలించాలని లేఖలో వారు కోరినట్లు కేటీఆర్ తెలిపారు.
పూర్తిగా చదవండి..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఒక్క కేసీఆర్ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీదకు కాంగ్రెస్, బీజేపీ దండులా వస్తున్నాయని.. కేసీఆర్ సింహంలాంటోడు, సింగల్గానే వస్తాడని కేటీఆర్ పేర్కొన్నారు.
Translate this News: