CM Revanth Reddy: ఎల్లుండి సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

TG: ఈ నెల 6న ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. కాగా సీఎం అయ్యాక రేవంత్ తో చంద్రబాబు భేటీ కావడం ఇదే తొలిసారి. విభజన సమస్యలపై సమావేశం అవుదామని CM రేవంత్‌కి చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

New Update
CM Revanth Reddy: ఎల్లుండి సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

CM Revanth Reddy: ఈ నెల 6న ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. కాగా సీఎం అయ్యాక రేవంత్ తో చంద్రబాబు భేటీ కావడం ఇదే తొలిసారి. ఇటీవల విభజన సమస్యలపై సమావేశం అవుదామని సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాసిన లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

చంద్రబాబు లేఖకు రేవంత్ రిప్లై..

ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్‌ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కూడా ఆయన లేఖ రాశారు. ఇటీవల ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే అరుదైన ఘనతను సాధించారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామన్న మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకిభవిస్తున్నానని తెలిపారు.

విభజన సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశం విభజన సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో ఈ నేల 6వ తేదీన మధ్నాహ్నం సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్‌ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. రాష్ట్ర విభజన జరిగి ఇంకా చాలా సమస్యలు పెండిగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు