Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు కీలక విభాగాలపై సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, సింగరేణిలపై సీఎం సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలో అధికారులకు కీలకమైన సూచనలు చేశారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్పై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లాగా యాంటీ నార్కొటిక్బ్యూరోను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఎవ్వరినీ ఉపేక్షించబోమని; అధికారులు, సిబ్బంది స్వేచ్ఛగా పనిచేయాలని ముఖ్యంత్రి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా యాంటీ నార్కొటిక్బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు
తెలంగాణలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినబడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, సింగరేణిలపై సోమవారం ఆయన సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.
Translate this News: