CM Revanth Reddy: కలిసిమెలిసి ఉందాం..తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్లు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేవారు. ఈ సందర్భంగా ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. కలిసి మెలిసి ఉండాలని కోరారు.

CM Revanth Reddy: కలిసిమెలిసి ఉందాం..తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్లు
New Update

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకరికొకరు ట్వీట్లు చేసుకున్నారు. నిన్నటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆంధ్ర సీఎం జగన్ రాలేకపోయారు. కానీ రేవంత్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయనతో పాటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా శుబాకాంక్షలు తెలిపారు జగన్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని...కలిసి అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారు.

Also read:ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్..మరి కాసేపట్లో ప్రజాదర్బార్

వైఎస్ జగన్ ట్వీట్ కు నూతన సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. అభినందనలు తెలిపనందుకు ధన్యవాదాలు చెబుతూ..తమ నూతన ప్రభుత్వానికి ఆంధ్రతో పాటూ అన్ని రాష్ట్రాలు పరస్పర సహకారం అందించాలని రేవంత్ కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహభావం పెంపొందాలని కొత్త సీఎం ఆకాంక్షించారు.

Also read:గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే..

#revanth-reddy #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe