CM KCR Wife Shobha: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కసర్ రెడ్డి తదితరులు శోభమ్మకు ఘనం స్వాగతం పలికారు. దగ్గరుండి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. స్వామివారికి శోభమ్మ తలనీలాలు సమర్పించుకున్నారు.

CM KCR Wife Shobha: తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి..!!
New Update

CM KCR Wife Shobha Visits Tirumala: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కసర్ రెడ్డి తదితరులు శోభమ్మకు ఘనం స్వాగతం పలికారు. దగ్గరుండి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. స్వామివారికి శోభమ్మ తలనీలాలు సమర్పించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లారు. కాగా శ్రీవారి దర్శనం కోసం సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆమెతోపాటు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: తరిగిన కూరగాయలను ఫ్రిజ్ లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

కాగా శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్కోరోజు దాదాపు 68వేలకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: నేడు CID ముందుకు లోకేశ్…సర్వత్రా ఉత్కంఠ ..!!

#tirumala #cm-kcr-wife #cm-kcr-wife-shobha-visits-tirumala #cm-kcr-wife-shobha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe