తెలంగాణ(Telangana) నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రులతో కలిసి సచివాలయానికి చేరుకుని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన భార్యతో కలిసి, పూజారుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగానే అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీ ఇప్పటికే ముగియగా దానికి సంబంధించిన వీడియోను కింద చూడండి.
పూర్తిగా చదవండి..Cabinet Visuals: ముగిసిన రేవంత్ తొలి కేబినెట్ భేటీ.. విజువల్స్, ఫొటోస్..!
సచివాలయంలో రేవంత్రెడ్డి తొలి కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు 11 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తీసుకొచ్చిన కొన్ని ఫైళ్లపై రేవంత్ సంతకం చేశారు.
Translate this News: