Telangana: తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్కార్ కీలక నిర్ణయాలు ఇవేనా..!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రి మండలి మ. 3 గంటలకు సమావేశం కానుంది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. పంట నష్టం, విద్యా సంవత్సరం ఆరంభం, కాళేశ్వరం మరమ్మతుల అంశాలపై కేబినెట్‌లో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

New Update
Telangana: తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్కార్ కీలక నిర్ణయాలు ఇవేనా..!

Also Read: ఈసీ స్పెషల్ ఫోకస్.. ఈ జిల్లాలో పెట్రోల్ బంకులపై ఆరోజు వరకు ఆంక్షలు.!

కొత్త ఎజెండాతో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అకాల వర్షాలకు పంట నష్టం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో చర్చ జరపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫార్మ్స్ అంశాలపై చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం మరమ్మతుల కోసం మంత్రివర్గం నిధులు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు