Samantha-Naga Chaitanya: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు

బీజేపీ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి బెడ్రూంలో తొంగి చూసి ఆనందించే లక్షణాలు ఉన్న వయోరిజమ్ అనే డబ్బు ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-అక్కినేని నాగచైతన్య దంపతుల పెళ్లి పెటాకులైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samantha-Naga Chaitanya: ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు
New Update

Samantha - Naga Chaitanya Divorce: ఫోన్ ట్యాపింగ్ కారణంగా సమంత-అక్కినేని నాగచైతన్య దంపతుల పెళ్లి పెటాకులైందని బీజేపీ కీలక నేత డా.బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వయోరిజమ్ (Voyeurism) అనే జబ్బు ఉందన్నారు.

వేరే వారి బెడ్రూంలో తొంగి చూడడం, భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలు వినడం కొందరికి ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. దాన్ని తమ మెడికల్ భాషలో వయోరిజం అనే జబ్బు అని పిలుస్తామన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అని అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఇద్దరు, ముగ్గురిని వెంట తీసుకు వెళ్లే రేవంత్ రెడ్డి ఈ సారి ఒక్కడే వెళ్లాడన్నారు. కేసీఆర్ తో కాంగ్రెస్ డీల్ ఓకే అయ్యిందని ఆ పార్టీ హైకమాండ్ రేవంత్ కు చెప్పిందన్నారు. అందుకే రేవంత్ వెనక్కు తగ్గాడని ఆరోపించారు.

#samantha #naga-chaitanya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి