/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-5-1-jpg.webp)
Vizianagaram: రాష్ట్రంలో పలుచోట్లు ఎమ్మెల్యే టిక్కెట్ల పంచాయితీ నడుస్తోంది. తాజాగా, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు బయటపడింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను బొత్స ఫ్యామిలీను 'ఢీ' కొట్టాలంటే కొండపల్లి అప్పలనాయుడు తోనే సాధ్యం అంటున్నారు టీడీపీ శ్రేణులు. ప్రస్తుతం ఉన్న టీడీపీ ఇంఛార్జ్ కొండపల్లి శ్రీనివాస్ పార్టీ క్యాడర్ ను సమన్వయ పరచుకోలేకపోతున్నారన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉండేది ఇందుకే.. ఆర్టీవీతో వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ నుంచి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు పార్టీ మారారని గుర్తు చేశారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి గెలిపించినా అతను పార్టీ మారకుండా ఉంటాడన్న నమ్మకం లేదన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పార్టీని ముందుకు నడిపించే కొండపల్లి అప్పలనాయుడుకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్ధి విషయంపై టీడీపీ అధిష్టానం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.