దళితులను చంపిన వారికి మాత్రమే ములాఖత్ లా..!?

రాజమహేంద్రవరంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను కుటుంబ సభ్యులకు ఎందుకివ్వరు అంటూ ప్రశ్నించారు. లాయర్ల ములాఖత్ ను ఎందుకు తగ్గించారు.? దళితులను చంపిన వారికి మాత్రం ఇష్టానుసారంగా ములాఖత్ లా.? అంటూ మండిపడ్డారు. భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపే హక్కు కూడా మాకు లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర. ఈ క్రమంలోనే జగన్ రాక్షస క్రీడకు త్వరలో ముగింపు చెప్పాలని కోరారు.

New Update
Breaking: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి

Chandrababu:  రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు ఫుల్ స్టాఫ్‌ పడాలని మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులు ఇచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లభించడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబుతో లాయర్లు రోజువారీ అయ్యే ములాఖత్ లను కూడా తగ్గించారని మండిపడ్డారు. దళితులను చంపిన వారికి, శిరోముండనాలు చేసిన వారికి ఇష్టానుసారంగా ములాఖత్ లకు అవకాశం ఇస్తున్నారని దుయ్యబట్టారు టీడీపీ నేతలు.

రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగారం వద్ద కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కళావెంకట్రావు మాట్లాడుతూ..‘‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాకు ఆందోళన ఉందని చెప్పారు. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షలు, డాక్టర్లు ఏం సలహాలు ఇచ్చారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని భువనేశ్వరి ఇటీవల అధికారులకు లేఖ కూడా రాశారని తెలిపారు. వైద్య నివేదికలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలతో 40 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని ఫైర్ అయ్యారు. కేసును ఏదో విధంగా ఆలస్యం చేసి చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులుగా ఒక్క ఆధారం కూడా కోర్టులకు చూపించలేదని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండే విధంగా జగన్ ఉండటం లేదని విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు. జైల్ల శాఖ డీఐజీ ప్రభుత్వాన్ని మెప్పించేలా మాట్లాడుతున్నరన్నారు. జగన్ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని పోలీసులను పావులా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. డాక్టర్ల నివేదకను వెంటనే కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి చూస్తే బాధగా ఉందిని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి పట్ల ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని సూచించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా.? అంటూ ప్రశ్నించారు. లాయర్ల ములాఖత్ ను కూడా తగ్గిస్తున్నారు.  చట్టాల్లోని లోపాలను వినియోగించుకుని, వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారని దూషించారు. ఈ వికృతానందం ఎన్నో రోజులు ఉండదని అన్నారు.  భువనేశ్వరిని కలిసే హక్కు కూడా మాకు లేదా..పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా.? అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును జైల్లో పెట్టిన నాటినుండే వైసీపీ కౌండ్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చారు. ఒక ఉన్నత వ్యక్తి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదంటే న్యాయవ్యవస్థలు కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబుకు ఆరోగ్య పరంగా ఏదన్నా అయితే జగన్ దే బాధ్యత అని కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, యార్లగడ్డ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల సంచలన వాఖ్యలు.. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అంటూ ధ్వజం

Advertisment
తాజా కథనాలు