B.Tech Ravi: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి

కడపలో వైఎస్ వివేకా హత్యపై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వాఖ్యలు వాస్తవమన్నారు టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి. వైసీపీ పార్టీ రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మ ఎవరి వైపో ప్రజలకు తెలుపాలని అన్నారు.

B.Tech Ravi: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి
New Update

B.Tech Ravi : కడప(Kadapa) లో వైఎస్ వివేకా(YS Viveka) హత్యపై ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) చేసిన వాఖ్యలు వాస్తవమన్నారు టీడీపీ(TDP) సీనియర్ నేత బీటెక్ రవి(B.Tech Ravi). ఇన్ని రోజులు జగన్ ఛానల్, సజ్జల వివేకా హత్యపై పలు రకాల ఆరోపణలు చేశారన్నారు. వివేకాను చంపితే మాకు లాభం ఏమిటి అన్నారని.. అయితే హత్యకు జరిగిన కుట్ర గురుంచి షర్మిల కుండబద్దలు కొట్టారని కామెంట్స్ చేశారు. ఎంపీగా పోటీ చేయాలని చిన్నాన్న ఎందుకు బలవంతం చేసారనేది తనకు ఇప్పుడు అర్ధమైందని షర్మిల వ్యాఖ్యానించారన్నారు.

Also Read: పెన్షన్ల పంపిణీపై హైకోర్టు కీలక నిర్ణయం

జగన్ ఏమి చేసినా ఇడుపుల పాయకు వెళ్లి ఆశీర్వదం తీసుకుంటారని..వైఎస్ ఆత్మ క్షోభించే విదంగా జగన్ వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మ ఎవరి వైపో ప్రజలకు చెప్పాలని కోరారు. చిన్నాన్న హత్య చేసిన వ్యక్తిని ఎలా చెల్లెలు పై పోటీ పెట్టారని ప్రశ్నించారు. చిన్ననాను హత్య చేసినదేవరో ప్రజలకు తెలుసని..వైసీపీ పార్టీ రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ అని ఆరోపించారు. హంతకులు ఎవరి చుట్టో కాదు జగన్ చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు.

#btech-ravi #kadapa #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe