TDP Buddha Venkanna : వైసీపీలో అభ్యర్థుల మార్పు చేర్పులు ఇందుకే.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు..!

వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పు చేర్పులపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్లు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. మూటలు ఇచ్చాకే సీట్లల్లో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.

New Update
TDP Buddha Venkanna : వైసీపీలో అభ్యర్థుల మార్పు చేర్పులు ఇందుకే.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు..!

TDP Buddha Venkateswara Rao : అధికార పార్టీ వైసీపీ(YCP) అభ్యర్థులను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల జాబితా మార్పు చేర్పులపై టీడీపీ(TDP) సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన కామెంట్లు చేశారు. సీఎం జగన్(CM Jagan) డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారన్నారు. మూటలు ఇచ్చాకే సీట్లల్లో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఓసారి అభ్యర్థిని ప్రకటిస్తే.. అదే ఫైనల్ అని స్పష్టం చేశారు.

అప్పుల అప్పారావు

కేశినేని నాని(Kesineni Nani) దెబ్బకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(Vasantha Krishna Prasad) వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు బుద్దా వెంకన్న. కేశినేని నానికే డిపాజిట్ రాదు.. అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యనించారు. కేశినేని నాని అప్పుల అప్పారావుని ఎద్దేవ చేశారు. టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని కొందరు దగ్గర అప్పులు చేశాడని ఆరోపించారు.

Also Read: కస్టమర్ కు యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బిగ్ షాక్..!

జగనే తీర్చాలి..

మైలవరం వైసీపీ ఇన్ఛార్జీగా ఉండి కూడా డబ్బులు కొట్టేసి ఉంటాడని విమర్శలు గుప్పించారు. కేశినేని నాని అప్పులను జగనే తీర్చాలన్నారు. అప్పులు తీర్చకుండా ప్రచారానికి వెళ్తే.. అప్పుల వాళ్లు నాని వెంటే ఉంటారని చురకలు వేశారు. టీడీపీ నేతల వద్ద తీసుకున్న అప్పులు తీర్చాల్సి వస్తుందనే నాని పార్టీ మారారని కామెంట్స్ చేశారు. కేశినేని నాని వెనుక టీడీపీ నేతలే కాదు.. ఆయన ఫ్యామ్లీ కూడా లేదన్నారు. కేశినేని నానికి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం కూడా డౌటేనని సందేహం వ్యక్తం చేశారు.

మొన్నటి కొడాలి.. ఇప్పుడు కేశినేని

నాని విశ్వాసం లేని కుక్క అంటూ మండిపడ్డారు. చంద్రబాబుపై లేనిపోని నిందలేస్తూ మొరుగుతున్నారని ధ్వజమెత్తరు. మొన్నటి వరకు కొడాలి నాని.. ఇప్పుడు కేశినేని నాని మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని సత్య హరిశ్చంద్రుడైనట్టు పెద్దిరెడ్డి మట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని కేశినేని నాని చెప్పేశాడని పెద్దిరెడ్డి సర్టిఫికెట్(Certificate) ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.

Also Read : చైనాకు చుక్కలే.. 2వేల కిలోమీటర్ల దూరంలోని శత్రువులను ఒక్క దెబ్బతో ఫసక్ చేయవచ్చు!

Advertisment
తాజా కథనాలు