/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Tamilnadu-Global-Investers-Meet-2024-jpg.webp)
Tamilnadu Global Investors Meet: తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం.. కొత్త పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సీఎం స్టాలిన్ విదేశాలకు వెళ్లి వచ్చారు కూడా. ఈ క్రమంలో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్లోఈరోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సందడిగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొనసాగే తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 450 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు.
ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ..
Tamilnadu Global Investors Meet: 2030 నాటికి తమిళనాడును ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే విధానం దిశగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పలు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా విదేశీ పెట్టుబడులను పెంచడం ద్వారా స్థానిక ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది. ముఖ్యంగా తమిళనాడులో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడంతోపాటు తలసరి ఆదాయం పెరగడానికి ఇది దారి తీస్తుంది.
Also Read: ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్.. ప్రభుత్వం సీరియస్.. చర్యలకు రెడీ
ప్రధాన పెట్టుబడులు..
Tamilnadu Global Investors Meet: సింగపూర్, కొరియా, డెన్మార్క్, జర్మనీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఈ సదస్సులో తమిళనాడులో తమ వ్యాపారాల ఏర్పాటు, విస్తరణకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. దీని ప్రకారం రూ.31,000 కోట్ల పెట్టుబడుల కోసం తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు భారత్లోని జెనీ సింగపూర్ ఎంబసీ ప్రకటించింది. ఐఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్ను విస్తరించేందుకు హోసూర్లో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని టాటా నిర్ణయించింది. దీని ద్వారా వచ్చే 6 ఏళ్లలో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ తమిళనాడులో రూ.16,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తూత్తుకుడిలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల తమిళనాడులో 3,500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా, హ్యుందాయ్ కార్ల తయారీ, బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాలు, క్యాప్లిన్ ఫార్మాస్యూటికల్ తయారీ, సెంప్కార్ప్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్తో సహా అనేక కంపెనీలు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాయి.
Watch this interesting Video: