GHMC: హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరాన్ని గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతున్నట్లు తెలిపారు.