BREAKING: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య టీడీపీలో చేరారు.
ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య టీడీపీలో చేరారు.
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
వచ్చే ఏపీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన ముఖ్యనాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై వారితో చర్చించారు. తమ అభిమానాన్ని ఓట్లుగా చేయండని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.
ఈరోజు ఏపీ కేబినెట్ లో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షలకు పెంచడంతో పాటూ తాత, అవ్వలకు ఇచ్చే పింఛను 3 వేల రూపాయలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఆంధ్రలో వైసీపీకి షాక్ ఇస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ సెంట్రల్ ఆఫీసులో జాయిన్ కానున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రపై కౌంటర్లు వేశారు అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్. యువగళం పాదయాత్ర కామెడీ యాత్ర అని ఎద్దెవ చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని చురకలు వేశారు.
ఆంధ్రలో వైసీపీని తలదన్నేవాడు ఎవడూ లేడంటోంది టైమ్స్ నౌ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెబుతోంది టైమ్స్ నౌ ఈటీజీ ఒపినీయన్ పోల్. క్రితంసారి కంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది.
మంగళగిరి, గాజువాక ఇంఛార్జ్ లను మార్చడంపై వైసీపీలో కలకలం రేగింది. ఇలా సడెన్ గా ఇంఛార్జ్ లను మార్చడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. దీని వెనుక కారణాలేంటా అని ఆరాలు తీస్తున్నారు. కానీ పార్టీ బావుండాలి అంటూ మార్పులు సహజమని చెబుతున్నారు మంత్రి అమర్ నాథ్.
గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి దేవన్ రెడ్డితో భేటి అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన దేవన్రెడ్డి పార్టీ నుంచి బలమైన హామీ ఇవ్వడంతో ఆయన శాంతించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.