Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాపుల కలలను చెరిపేసాడు: తోట త్రిమూర్తులు!
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
రాజకీయ లబ్ధికోసం లోకేష్ మొక్కుబడి పాదయాత్ర చేశారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్నినాని. యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే శవాన్ని చూసే సంస్కారం కూడా లోకేష్ కు లేదని.. అప్పుడు పాదయాత్ర ఆపలేదు కానీ, చంద్రబాబు జైలుకెళ్తే మాత్రం పాదయాత్ర ఆపేశారని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ కి కొత్త తలనొప్పి వచ్చి చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన సీఎంవో నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్లడం లేదని సమాచారం.
వైసీపీ ఇప్పటి నుంచే రానున్న ఎన్నికల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేనట్లు సమాచారం. అందుకే వారిని తాడేపల్లికి పిలిపించి జగన్ పర్సనల్ గా మాట్లాడుతున్నారు.
ఏపీలో ఎన్నికల హీట్ అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికార పక్ష నాయకులు తమకు సీట్ వస్తుందా రాదా అనే టెన్షన్ లో ఉన్నారు. అందుకే అధికార నాయకులను కాకా పట్టే పనిలో పడ్డారు నాయకులు. అందుకే తాడేపల్లిలో కొందరు మకాం వేసినట్లు సమాచారం.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న చర్చ సాగుతోంది. ముద్రగడ కొడుకు చల్లారావును కాకినాడ ఎంపీ లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోందని సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
నగర శివారులోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పై ఐటీ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. ఈ కంపెనీ సీఎం జగన్ కి సన్నిహిత కంపెనీ అని సమాచారం.
వైసీపీ నేత బరిగల కోటేష్ తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధిపై సంచలన ఆరోపణలు చేశారు. రక్షణనిధి టీడీపీకి అమ్ముడుపోయాడని, సీఎం జగన్ పేరు చెడగొడుతున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు.