Ap Politics: ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి: అంబటి రాయుడు!
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలపడంతో వారి నాయకత్వంలో రాష్ట్రానికి రానున్న రోజుల్లో మంచి రోజులు రానున్నాయని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈసారి ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ తగిలింది. ఎప్పటికీ కోలుకోలేని విధంగా కూటమి వైసీపీ ఓడించింది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా..ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి చేరువలో ఉంది. ఇప్పటికే చాలా ఆధిక్యంలో దూసుకువెళుతున్న కూటమి...ఈసారి అక్కడ గవర్నమెంటు ఏర్పాటు చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి? వైసీపీ ఎందుకు గెలవలేకపోయింది కింది ఆర్టికల్లో చూడండి.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ సమన్వయంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఏపీ ప్రజలు ఐదేళ్ల పాటు పడ్డ కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడబోతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు టెలీకాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు.
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
గ్జిట్ పోల్స్ సర్వేలో వైసీపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ చేసిన సర్వే అంత ఫేక్ అని దానిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ కి బుద్దా ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
AP: బ్యాలెట్ ఓటు విషయంలో సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సాయంత్రం 6 గంటలకు తీర్పును వెల్లడించనుంది. కాగా హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.