Santhi Swaroop: మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత
దూరదర్శన్ తెలుగు వార్తలు అనగానే మనకు గుర్తుకువచ్చే వ్యక్తి శాంతిస్వరూప్. తెలుగు మొట్టమొదటి న్యూస్ రీడర్ ఈరోజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మలక్ పేట యశోదా ఆస్పత్రిలో శాంతిస్వరూప్ భౌతికకాయం ఉంది.