Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎందుకివ్వడం లేదు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.